కియా కారులో 9 మంది కూర్చోవచ్చట.. త్వరలోనే?
కియా కారు.. ఈ కారులో ఏకంగా 9మంది కూర్చోవచ్చట. అయితే ఈ కారు ఇంకా రాలేదు కానీ త్వరలోనే వస్తుందట.. అయితే ఈ కారు గురించి మరింత సమాచారం మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
కియా మోటార్స్ వారి నెక్ట్స్ మోడల్ "కియా కార్నివాల్"ను ఇండియన్ మార్కెట్లోకి ఆవిష్కరించేందుకు సిద్దమయ్యింది. కియా కార్నివాల్ 6-సీటర్, 7-సీటర్, 8-సీటర్ అలాగే 9-సీటింగ్ ఆప్షన్లో రానుంది. ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోయే 2020 ఇండియన్ ఆటో ఎక్స్పోలో కార్నివాల్ ఎంపీవీ కారును ఆవిష్కరించనున్నారు.
అయితే ఈ కారును కస్టమర్ల అవసరాలకు తగ్గట్లుగా విభిన్న సీటింగ్ ఆప్షన్లలో కార్నివాల్ ఎంపీవీ కారును లాంచ్ చేసేందుకు కియా మోటార్స్ ఏర్పాట్లు ప్రారంభించింది. అయితే ఇప్పటివరకు ఈ కారు సీటర్ గురించి ఇంకా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.. అయితే ఈ కారు ప్రారంభ ధరే సుమారు 30 లక్షలు ఎక్స్-షోరూమ్ గా ఉండవచ్చు అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.