సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సిఎం...!

జమ్మూ కాశ్మీర్ మాజీ సిఎం ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేసారు. ఫరూక్ అబ్దుల్లా బుధవారం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కాశ్మీర్ ప్రజలు అసలు భారతీయులుగా ఉండటానికి ఇష్టపడరు అని ఆయన ఆరోపించారు. చైనీయులుగా ఉండటానికి ఇష్టపడతారు అంటూ పేర్కొన్నారు. ప్రజల మానసిక స్థితి కాశ్మీర్ లోయలో ఏ విధంగా ఉంది అని అడగగా ఆ ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు.
నిజం చెప్పాలి అంటే మీరు వెళ్లి అక్కడ ఎవరితో అయినా మాట్లాడండి. వాళ్ళు అసలు ఇండియాన్స్ అని చెప్పుకోవడానికి ఆసక్తి చూపించరు. దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు మనం బ్రతికి ఉంటామా అనేది నాకు అర్ధం కావడం లేదని ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. అంతే కాదు పాకిస్తాన్ ప్రజలు మాదిరిగా కూడా ఉండాలని కోరుకుంటారు అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: