టోక్యో ఒలింపిక్స్ లో నేడు యావత్ భారత్ దేశం ఎదురు చూస్తున్న తరుణం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు క్వార్ట్రర్ ఫైనల్ లో విజయం సాధించి సెమిస్ కి చేరుకున్న సంగతి తెలిసిందే . ఇక నేడు సింధు తన అదృష్టాన్ని సెమీస్ లో పరీక్షించుకునే సమయం ఆసన్నమయింది. సెమిస్ పోరులో తైజాయింగ్ తో తలపడనుండగా పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్లో నేటి వరకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా రికార్డు క్రెయిట్ చేసింది. కాగా సెమిస్ లో పీవీ సింధు కి కఠిన పరీక్ష ఎదురవనుంది. కాగా చైనా ప్లేయర్ తైజాయింగ్ పీవీ సింధు రికార్డు బాగా లేకపోవడం తో సెమిస్ గండాన్ని దాటుతుందా లేదా అని వేచి చూడాలి. కాబట్టి అందరు సెమిస్ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.