పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్రెండ్ మార్చారు. ఇప్పటి వరకూ సభలు సమావేశాలు నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు కురిపించగా ఇప్పుడు సోషల్ మీడిమా ద్వారా వరుస పోస్టులు చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి అంటూ ఓ పోస్ట్ చేశారు. హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు .. రెండు కాదు .. ఏకంగా 140 దాడులు , విధ్వంసాలు జరిగాయంటూ పవన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు .
అంతే కాకుండా వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే అంటూ వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. మహిళలపై దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమంగా ఉన్నారంటూ పవన్ కల్యాణ్ సంచలన ఆరోపనలు చేశారు. ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు..? అంటూ పవన్ ప్రశ్నలు కురింపించారు .