బ్రేకింగ్ : టిడిపి కేంద్ర కార్యాలయం వద్ద మరోసారి ఉద్రిక్తత..!
నడుచుకుంటూ వెళ్లి నారా లోకేష్ పోలీసులతో గొడవకు దిగారు. ఈ సందర్భంగా నారా లోకేష్ రంగ ప్రవేశంతో పోలీసులు వెనక్కి తగ్గారు. దీంతో కాసేపు పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం తలెత్తినట్టు సమాచారం. ఇది ఇలా ఉంటే నిన్న టిడిపి కేంద్ర కార్యాలయం పై ఆటోలలో వచ్చిన కొందరు దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో కార్యాలయంలో ఫర్నిచర్ ఇతర వస్తువులు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో కార్యాలయంలో ఉన్న వారిపై దాడికి పాల్పడడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకొని ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు.