బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శర వేగంగా జరుగుతోంది. ఈ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ను మొత్తం 12 రౌండ్లలో చేపట్టనున్నారు. ఇక తొలి రౌండ్ నుంచి కూడా ఇక్కడ వైసీపీ స్పష్టమైన ఆధిక్యం తో దూసుకు పోతోంది. తొలి రౌండ్ లోనే డాక్టర్ దాసరి సుధ కు ఏకంగా 9 వే ల పై చిలుకు ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక ఇప్పటికే ఇక్కడ ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఆరు రౌండ్లు పూర్తయ్యే సరికి వైసీపీ అభ్యర్థి సుధకు ఏకంగా 52 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ దూకుడు చూస్తుంటే తుది ఫలితం తేలే సరికి వైసీపీకి ఇక్కడ లక్ష పై చిలుకు ఓట్ల మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు. జగన్ ఆ పార్టీ నేతలకు పెట్టిన లక్ష మెజార్టీ సులువుగా రీచ్ అయ్యేలా ఉంది.