పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బోల్డ్ బ్యూటీ కంగనా మరోసారి కూడ అలాగే వ్యవహరించినది. ఈసారి రియాక్షన్ మరీ ఎవరూ ఊహించని వ్యక్తి నుంచి వచ్చినది. గాంధీ కుటుంబ వారసుడు కంగనా స్టేట్మెంట్ను తప్పుపట్టారు. అది రాహుల్ గాంధీ కాదు, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ నుంచి ఇది పిచ్చి అనాలా లేక దేశ ద్రోహం అనాలా అని ఘాటైన వ్యాఖ్యలు ట్విట్ చేసారు.
1947లో మనకు దక్కింది ‘భిక్ష’ మాత్రమే అని, నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చింది అంటూ మోడీ ప్రధాని అవ్వడాన్ని ఉద్దేశిస్తూ కంగనా ఒక కామెంట్ చేసింది. దానిపై పలు విమర్శలు, సమర్థనలు కూడ వచ్చాయి. నరేంద్ర మోడిని కంగనా ఇలా పొగడటం, సమర్థించటం ఇప్పుడు కొత్త కాకపోయినా ఆమె కామెంట్కి వరుణ్ గాంధీ రియాక్ట్ అవ్వడం సొషల్ మీడియాలో ఇప్పుడు చర్చగా మారినది. మహాత్మా గాంధీ త్యాగాన్ని అవమానించటం కొన్నిసార్లు, ఆయన హంతకుడ్ని కీర్తించటం కొన్నిసార్లు చేస్తుంటుంది కంగనా.. ఇక ఇప్పడు స్వాతంత్య్ర సమరయోధులు మంగళ్ పాండే, రాణీ లక్ష్మీభాయి, భగత్ సింగ్, లక్షలాది మంది త్యాగాలను సైతం చులకన చేయడాన్ని ఏమనాలి..? పిచ్చా..? లేక దేశ ద్రోహమా? అని ట్విట్టర్లో కంగనను విమర్శించారు వరుణ్గాంధీ.
ఇన్ని రోజులు కంగనాకు వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీల వాళ్లు మాత్రమే మాట్లాడేవారు ఆమె కమలదళానికి సపోర్ట్గా కామెంట్స్ చేస్తుండడంతో కాషాయ నాయకులు విమర్శించకుండా ఉన్నారు. కానీ ఇవాళ బీజేపీ ఎంపీ ఆమెను మొదటిసారిగా తప్పుబట్టారు. బీజేపీ నేత వరుణ్గాంధీ గత కొంతకాలంగా మోడీ, అమిత్షాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్న కంగనా రనౌత్పై ఆయనస్ట్రాంగ్ రియాక్ట్ అయి ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.