అమరావతినే రాజధానిగా ఉంచాలి : టీజీ వెంకటేష్
అశోకుడి పాలనలో కర్నూలు జిల్లాలోని జొన్నగిరి రాజధాని ఉండేదని.. మా ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణ కమిటీకి తెలియజేసినట్టు చెప్పారు. వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి తర్వాత హైకోర్టు కోసం ప్రయత్నం చేయాలని లేకపోతే రెండూ పోతాయని వెల్లడించారు. వైజాగ్ లో సెక్రటేరియట్ పెడితే మాకు దూరం అవుతుందని, కర్నూలులో కూడా మినీ సచివాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. రైతులు, భూములు పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాలని, మూడు రాజధానులపై మళ్లీ చట్టం చేసి కోర్టుకు వెళ్తే ఎలాంటి ప్రయోజనం చేకూరదని స్పష్టం చేశారు టీజీ వెంకటేష్.