పలాసలో అంబులెన్స్ను ఢీ కొట్టిన రైలు
రోగిని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ పలాస రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్ పైకి వెళ్తున్న అంబులెన్స్ను ఇంటర్సిటీ రైలు ఢీ కొట్టింది. అంతసేపు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా అంబులెన్స్ను రైలు ఢీ కొట్టడంతో ప్రజలు పెద్ద ఎత్తున గుమి కూడడంతో ఏమి జరిగిందో అర్థం కాక కొంత మంది ప్రయాణికులు బిత్తరపోయారు. ఆనోటా ఈ నోటా ప్రమాదం గురించి తెలిసి ఒక్కసారిగా హుటాహుటిన అక్కడికి చేరుకుని ప్రమాదాన్ని తిలకిస్తుండగా పోలీసులు అక్కడి నుంచి అందరినీ పంపించారు.