హెలికాప్టర్ ప్రమాదంపై రాజ్నాథ్సింగ్ సంతాపం
ప్రస్తుతం వెల్లింగ్టన్లోని మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన విషయాన్ని ఆర్మీ చీఫ్ ద్వారా తెలుసుకున్న రాజ్నాథ్ సింగ్ వెంటనే ప్రధాని మోడీకి వెల్లడించారు. ఆ తరువాత వెంటనే అత్యవసర క్యాబినెట్ భేటీ నిర్వహించారు. క్యాబినెట్ భేటీ అనంతరం రక్షణమంత్రి బిపిన్ రావత్ నివాసానికి చేరుకున్నారు. ఆ తరువాత హెలికాప్టర్ ప్రమాదంపై రేపు ప్రకటన చేస్తాను అని వెల్లడించారు రాజ్నాథ్సింగ్. ఈ తరుణంలోనే బిపిన్ రావత్ మృతి చెందినట్టు ఇండియన్ ఎయిర్ఫోర్స్ ప్రకటించింది.