అటెన్షన్ జగన్: విజయవాడలో బీజేపీ దీక్ష..?
ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. అందుకే.. నేడు బీజేపీ విజయవాడలో ఒక్కరోజు నిరసన దీక్ష చేపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలకు సంఘీభావంగా ఈ నిరసన దీక్ష ఉంటుంది. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు సోము వీర్రాజు దీక్షలో పాల్గొంటారు. దీక్షలో ఆయనతో పాటు ఎంపీలు సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీలు మాధవ్, నారాయణరెడ్డి
కూడా పాల్గొననున్నారు. ప్రజా పోరాటాల ద్వారా తన విస్తృతి పెంచుకునేందుకు బీజేపీ ఇలా ప్రయత్నిస్తోంది.