హీరోలు అల్లు అర్జున్, కల్యాణ్ రామ్లకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ల కార్లకు ఉన్న బ్లాక్స్ స్క్రీన్ను జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. ఇలా బ్లాక్ స్క్రీన్ వేసుకోవడం నిబంధనలకు విరుద్దం.. ఇలా చేసినందుకు అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కార్లపై ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఎస్సై శ్రీధర్ నిన్న రోడ్ నంబరు 36లోని నీరూస్ కూడలిలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అల్లు అర్జున్, కల్యాణ్రామ్ తమ కార్లలో అటుగా వెళ్తున్నారు. పోలీసులు వారి కార్లను ఆపి కార్ల అద్దాలకు ఉన్న బ్లాక్ స్క్రీన్ తొలగించారు. ఒక్కో కారుకు రూ.700 చొప్పున చలాన్లు రాశారు. ఇంకా ఇలా నిబంధనలు పాటించని మరో 80 వాహనాలకు కూడా చలాన్లు రాసి.. కేసులు నమోదు చేసినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.