ఎంపీగా రాజమౌళి తండ్రి.. మోదీ బంపర్ ఆఫర్?
విజయేంద్ర ప్రసాద్తో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, పరుగుల రాణి పి.టి.ఉషను కేంద్రం రాజ్యసభకు నామినేట్ చేసింది. కర్ణాటకలోని ధర్మస్థల మఠం పీఠాధిపతి వీరేంద్ర హెగ్డేను కూడా రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కథా రచయిత విజయేంద్రప్రసాద్ దశాబ్దాలపాటు సృజనాత్మక సేవలు అందించారని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. విజయేంద్రప్రసాద్ సేవలు.. మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశాయన్నారు.