ఏపీలో పంద్రాగస్టు వేడుకలు.. జగన్ ఏంచేస్తారంటే?
పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను అధికారులు సిద్దం చేశారు. ఈ వేడుక తర్వాత సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్భవన్లో గవర్నర్ తేనీటి విందు ఇవ్వనున్నారు. ఈ విందు ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు రాజకీయ ప్రముఖులు హాజరుకాబోతున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావడంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.