ప్రేమ పెళ్లి: కోర్టులోనే భార్య గొంతు కోసేశాడు?
భార్య గొంతు కోసిన భర్త శివకుమార్ ను హాసన జిల్లా హొళెనరసీపుర పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని హాసన జిల్లాలోని తట్టికెరె వాసి చైత్ర, శివకుమార్ ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల క్రితం విడాకుల కోసం కోర్టుకెక్కారు. లోక్అదాలత్లో రాజీ కోసం వచ్చారు. విచారణ అనంతరం జడ్జి కేసును వాయిదా వేశారు. కుమారుడ్ని వెంటపెట్టుకుని వెళ్తున్న చైత్రను వెంబడించిన శివకుమార్ కోర్టు ఆవరణలోనే గొంతు కోసి పరారయ్యాడు. చికిత్స పొందుతూ చైత్ర మరణించింది.