వైఎస్ తోడల్లుడిని.. అందుకే అలా చేశారు?
అయితే.. తనకు ఏ పాపం తెలియదని.. కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తోడల్లుడిని అయినందువల్లే ఇందూ-హౌసింగ్ బోర్డు ఒప్పందాలకు సంబంధించిన అవకతవకల కేసులో ఇరికించారని తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ విచారణ జరిపారు.
వాదనల తర్వాత కేసు తదుపరి విచారణ సెప్టెంబరు 8కి వాయిదా పడింది.