చంద్రబాబుకు వైసీపీ మంత్రి సవాల్?
టీడీపీ హయాంలో ఏ ఒక్క వర్గం ప్రజలకైనా మేలు జరిగిందా అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. మాట వస్తే 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని చెప్పుకుంటున్న చంద్రబాబు... బీసీలకు ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు మహిళలకు రైతులకు ఏం చేశారో బహిరంగంగా చెప్పాలని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు మానుకొని ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు సహకరించాలని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.