వారికి వైఎస్ రిజర్వేషన్...జగన్ కార్పొరేషన్ ?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరులో పర్యటించనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఏర్పాట్లను పర్యవేక్షించారు. మౌలానా అబుల్ కలాం జయంతి కార్యక్రమంలో సీఎం పాల్గొనబోతున్నారు. ఈ ఏర్పాట్ల విషయంపై అధికారులతో సమీక్షించిన అనంతరం అంజాద్ బాష మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీలను సమావేశానికి అంజాద్ బాష ఆహ్వానించారు. సీఎం పర్యటనను నేతలంతా కలిసి జయప్రదం చేస్తామని అంజాద్ బాష అన్నారు.