ఏపీలో పేద రోగులకు శుభవార్త చెప్పిన జగన్?

Chakravarthi Kalyan
ఇది పేదలకు నిజంగా శుభవార్తే.. ఇక గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో త్వరలో గుండె శస్త్రచికిత్సలు మళ్లీ జరగబోతున్నాయి. గతంలో నిలిచిపోయిన గుండె ఆపరేషన్లు మళ్లీ చేపట్టాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఈ బాధ్యతలు నిర్వర్తించిన ఆళ్ల గోపాలకృష్ణకు మరోసారి ఈ బాధ్యతలను ప్రభుత్వం అప్పగిస్తారు. డాక్టర్ గోఖలే నేతృత్వంలోని వైద్యుల బృందం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని ఆమె ఛాంబర్ లో కలిసి ఈ అంశాలపై చర్చించారు. ఈ మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి గుండె శస్త్రచికిత్స విభాగం నిపుణులు సమాయాత్తమవుతున్నారు.
శస్త్రచికిత్స మందిరాల్లో వసతులు.. రోగులకు అవసరమైన వార్డులు ఏ విధంగా సమాకూర్చాలన్న అంశాల గురించి చర్చించినట్లు డాక్టర్ ప్రభావతి చెబుతున్నారు. ఆపరేషన్ల కోసం అవసరమైన పరికరాలు, సిబ్బంది నియామకాలు, ఔషధాలు అందుబాటులో ఉంచాలన్న విషయాలపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా డాక్టర్ కుప్పుస్వామిను నియమించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: