కేసీఆర్పై తమిళిసై పంతమే నెగ్గింది?
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆ రోజు ప్రసంగిస్తారు. కొత్త సమావేశాలుగా కాకుండా గత సమావేశాలకు కొనసాగింపుగానే ఈ మారు కూడా ఉభయసభలు సమావేశం కానున్నాయని... దీంతో ప్రోరోగ్ చేయకుండానే తాజాగా సమనింగ్ నోటిఫికేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఎనిమిదో సెషన్ కు సంబంధించిన నాలుగో విడతగా అసెంబ్లీ సమావేశం కానుందని.. 18వ సెషన్ కు సంబంధించిన నాలుగో విడతగా కౌన్సిల్ సమావేశం కానుందని సమాచారం.