చర్మ సౌందర్యానికి ఇలా చెయ్యండి?

Purushottham Vinay
సౌందర్యానికి ఎర్ర కందిపప్పు బాగా ఉపయోగపడుతుంది.చర్మాన్ని మృదువుగా మార్చటంతోపాటు, కాంతి వంతంగా మారుస్తుంది. చర్మ సంరక్షణ సామర్థ్యాన్ని ఎర్ర కందిపప్పు కలిగి ఉన్నట్లు సౌందర్య నిపుణులు చెబుతున్నారు. టాన్ క్లియర్ చేయడం మొదలు, రంధ్రాలను బిగుతుగా మార్చడం వరకు, ఇది చర్మానికి మెరుపును ఇంకా పోషణను కూడా ఇస్తుంది.సహజమైన స్క్రబ్‌గా కూడా పనిచేస్తుంది. ఇంకా చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అలాగే చర్మాన్ని లోతుగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ఎర్ర పప్పులో ఉండే పోషకాలు ఇంకా యాంటీఆక్సిడెంట్లు అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో సహాయపడతాయి. రెడ్ లెంటిల్ ఫేస్ ప్యాక్‌లు డార్క్ స్పాట్స్ ఇంకా మొటిమల మచ్చలను సమర్థవంతంగా పోగొట్టడంలో సహాయపడతుంది.ఒక టేబుల్ స్పూన్ మసూర్ పప్పు పొడిని 1 టీస్పూన్ బాదం నూనె, గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్ కలిపి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, ఆరిపోయే వరకు వదిలివేయాలి. తరువాత చల్లటి నీటితో మెల్లగా కడగాలి.మొటిమల నివారణకు వారానికి ఒకసారి ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించండి.


ఇంకా అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే ఒక ఆరెంజ్ పండును తీసుకుని దానిని ఉండే తొక్కను వేరు చేయాలి. ఆ తర్వాత మిక్సీలో నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్‌ టేబుల్ స్పూన్ తేనె, రెండు నుంచి మూడు ఫ్రెష్ ఆరెంజ్ తొక్కలు, అరకప్పు బాదం పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మొఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత ముఖం వాష్ చేసుకోవాలి.ఇంకా అలాగే ఎర్రకందిపప్పు పొడిని పాలు, గుడ్డు తెల్లసొనతో కలుపుకోవాలి. పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేసి ఆరనివ్వాలి. సుమారు 10 నిమిషాల తర్వాత, చల్లటి నీటితో మీ ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే మీ చర్మాన్ని బిగుతుగా మార్చుకోవచ్చు. ముఖానికి సహజమైన కాంతిని అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: