ముఖం కాంతివంతంగా మారే సింపుల్ టిప్?

Purushottham Vinay
ఫస్ట్ మీరు ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ శనగపిండిని తీసుకోవాలి. ఆ తరువాత అందులో ఒక టీ స్పూన్ పెరుగును ఇంకా అలాగే ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ ను వేసి బాగా కలపాలి.ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా గడ్డలు కట్టకుండా బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి ఇంకా అలాగే మెడకు పట్టించాలి. ఇక ఆరిన తరువాత చల్లటి నీటితో మీ ముఖాన్ని బాగా శుభ్రపరుచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజూ కూడా చేయడం వల్ల ముఖం అందంగా మారుతుంది. ఇంకా అదేవిధంగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ పాలను తీసుకోవాలి. ఆ తరువాత అందులో ఒక టీ స్పూన్ రోజ్ వాటర్, 6 చుక్కల నిమ్మరసాన్ని వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఇంకా అలాగే మెడకు బాగా పట్టించి బాగా మర్దనా చేయాలి.ఒక 15 నిమిషాలు ఆగిన తరువాత శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల సమస్యలు అన్నీ కూడా తగ్గి ముఖం చాలా కాంతివంతంగా తయారవుతుంది.



 ఇంకా అలాగే అదే విధంగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ శనగపిండిని తీసుకోవాలి. ఆ తరువాత అందులో తగినంత రోజ్ వాటర్ ను వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఇంకా అలాగే మెడకు ప్యాక్ లా వేసుకోవాలి. ఇక ఆరిన తరువాత చన్నీటితో నీటితో శుభ్రపరుచుకోవాలి.ఇలా చేయడం వల్ల ముఖం పై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, వ్యర్థ పదార్థాలు ఇంకా అలాగే ఎండ వల్ల కలిగిన నలుపు తొలగిపోయి చర్మం అందంగా మారుతుంది. ఈ టిప్స్  పాటించడంతో పాటు ప్రతిరోజూ 4 నుండి 6 లీటర్ల నీటిని తాగాలి. బయటి ఆహారాన్ని ఇంకా అలాగే జంక్ ఫుడ్ ను తీసుకోవడం మానేయాలి. ఆ తరువాత బయటికి వెళ్లి రాగానే ముఖాన్ని చక్కగా శుభ్రపరుచుకోవాలి. ఈ టిప్స్ పాటించడం వల్ల చర్మం పై ఉండే నలుపు ఈజీగా తొలగిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా ఇంకా అలాగే ఆరోగ్యంగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: