చాలా మంది కూడా మచ్చలు మొటిమలు లేకుండా తెల్లగా అందంగా కనబడాలని ఎన్నో రకాల మేకప్ ప్రొడక్ట్స్ను ఉపయోగిస్తుంటారు. అయితే వీటి వల్ల అందంగా కనిపించినా కూడా ఆ తర్వాత మళ్ళీ ఖచ్చితంగా చర్మ సమస్యల బారిన పడుతుంటారు.అయితే చర్మ సంరక్షణతో పాటు అందంగా కనిపించాలి అంటే మన ఇంట్లోనే సహజమైన ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చని చర్మ నిపుణులు చెబుతున్నారు.మనం వీటిని తయారు చేసుకోడానికి ఇంట్లో లభించే పదార్థాలు సరిపోతాయి.ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవచ్చో పూర్తిగా మనం తెలుసుకుందాం.
ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ తేనెను కలుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత చేతులతో ముఖాన్ని సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయాలి.అనంతరం నీటితో ముఖాన్ని కడగాలి. ఇవి సహజమైన మాయిశ్చరైజర్ పనిచేస్తాయి.అలాగే రెండు స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ శెనగ పిండి, ముల్తానీ మిట్టి తీసుకోవాలి. ఈ మూడిటిని బాగా కలిపి చర్మంపై రాసుకోవాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మ వ్యాధుల బారిన పడకుండా ఉంటామని చర్మ నిపుణులు చెబుతున్నారు.ఇంకా అలాగే తేనెను నిమ్మరసంలో కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. ముందుగా గిన్నెలో ఒక టీస్పూన్ తేనె , నిమ్మరసం కలిపి ఫేస్కు పట్టించాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు తొలుగుతాయి.
అలాగే గంధంలో చాలా రకాల చర్మ కాంతి గుణాలు దాగి ఉన్నాయి. గంధం యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ముందుగా గంధం పొడిలో ఒక 1 టీస్పూన్ బాదం నూనె మరియు 1 టీస్పూన్ తేనెను మిక్స్ చేయాలి. 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.ఇంకా అలాగే పసుపు, శెనగపిండి చర్మమానికి ఎంతో మేలు చేస్తుంది. దీని కోసం మీరు ముందుగా శెనగపిండి, పసుపును తీసుకోవాల్సి ఉంటుంది. ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ శెనగ పిండిని తీసుకుని,ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రోజ్ వాటర్ వేసి మందపాటి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాని 15నిమిషాల పాటు ఉంచి తరువాత శుభ్రం చేసుకోవాలి. ఈ చేయడం వల్ల చర్మం అందంగా కనిపిస్తుంది.