ఇలా చేస్తే మచ్చలు, మొటిమలు తగ్గి మొహం మెరిసిపోతుంది?

Purushottham Vinay

ఇలా చేస్తే మచ్చలు, మొటిమలు తగ్గి మొహం మెరిసిపోతుంది?  

మనలో చాలా మందికి కూడా స్కూల్ డేస్ లో స్టార్ట్ అయిన మొటిమల సమస్య 30 ఏళ్ళు వచ్చేదాకా కొనసాగుతూ ఉంటుంది. ముఖంపై మొటిమలు మచ్చలు ఉంటే చాలా అందవిహారంగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పే టిప్స్ పాటిస్తే మొటిమలు మచ్చలని ఈజీగా తగ్గించుకోవచ్చు. మీరు 1 స్పూన్ బాదం నూనె అరస్పూను నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంటయ్యాక గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖం పై ఉన్న మృతకణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది.బాదం నూనెలో పాలు కలిపి ముఖానికి రాసి అరగంటయ్యాక నార్మల్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మీద ఉన్న నలుపు అంతా తొలగిపోతుంది. 


బాదం నూనె,పాలలో ఉన్న లక్షణాలు ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవటానికి సహాయపడతాయి. ఈ చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి కచ్చితంగా ట్రై చేయండి.ఇంకా మొటిమల సమస్య ఎక్కువగా ఉన్నవారు  ఒక స్పూన్ బాదం నూనెలో అర స్పూన్ తేనె కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి ఒక పది నిమిషాలయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా నాలుగు రోజులపాటు చేస్తే మొటిమలు, మచ్చలు అన్ని ఈజీగా  మాయమవుతాయి. ఈ రకంగా బాదంనూనెలో ఇవి కలిపి రాస్తే.. మచ్చలు పోయి మెరుస్తుంది.చర్మ సమస్యలను తగ్గించడంలో బాదం నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బాదం నూనెలో విటమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది. అంతేకాక ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదం నూనె చాలా సులువుగానే లభ్యం అవుతుంది.కాబట్టి కచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. ముఖం పై మచ్చలు, మొటిమల సమస్యని చాలా ఈజీగా తగ్గించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: