ఏం చెబుతారో... ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ‌...!

Lavanya

లాక్‌డౌన్ పై కొన‌సాగుతున్న స‌స్పెన్స్‌కు నేటితో  తెర‌ప‌డ‌నుంది. లాక్‌డౌన్‌ కొనసాగించాలా వద్దా అనే విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు రాత్రి కీలక ప్రకటన చేయనున్నారు. దేశ వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్ గ‌డువు రేప‌టితో ముగియ‌నుంది. దీంతో ప్ర‌ధాని మోడీ కీల‌క నిర్ణ‌యం వెల్ల‌డించే అ వ‌కాశం ఉంది. అయితే.. మోడీ దేశ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సందేశం ఇవ్వ‌బోతున్నారు..?  లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా..?  పొడిగించ‌రా..?  అని దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ లు ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. 

 

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య సుమారు ప‌ది వేలకు సమీపంలో ఉంది. ఇప్పటి వరకూ 273 మంది చనిపోయారు. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లో కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతుండటంతో లాక్‌డౌన్ కొనసాగించడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఇ ప్పటికే అనేక రాష్ట్రాలు నెలాఖరు వరకూ లాక్‌డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ తరుణంలో ప్రధాని చేయబోయే ప్రకటనకు ప్రాధాన్యత ఏ ర్పడింది. ప్ర‌ధాని మోడీ చేయనున్న ప్రకటన కోసం యావ‌త్ దేశమంతా ఎదురుచూస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: