ఏపీలో 11613 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు.. 11,111 నెగెటివ్ కేసులు
ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 11,613శాంపిల్స్ను సేకరించి, కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 11, 111 నెగెటివ్ కేసులు వచ్చాయని, 502 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని డిప్యూటీ ముఖ్య మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 16 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. బుధవారం కరోనా కట్టడి, తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు తీరుపై మంత్రుల బృందం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు. క్వారంటైన్ సెంటర్లలో ఉన్న సౌకర్యాలపై ముఖ్యమంత్రి జగన్ నిరంతరం సమీక్షిస్తున్నారని తెలిపారు. క్వారంటైన్లలో ఉన్నవారి వివరాలను పకడ్బందీగా సేకరిరంచాలని, క్వారంటైన్ నుంచి డిశ్చార్జ్ అయిన వారికి అవసరం అయితే.. మూడు వంద నుంచి రెండు వేల వరకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని డిప్యూటీ ముఖ్యమంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. క్వారంటైన్లలో ఉన్నవారికి అసౌకర్యం కలుగుకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపరాఉ.