11 నెలల కుమార్తెను చంపి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి... కారణం తెలిస్తే....!
అసలు ఈ ప్రపంచంలో కొందరు చనిపోయేందుకు ఎంచుకున్న కారణాలు చూస్తే చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఏ మాత్రం కారణం లేకుండా చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటోన్న వాళ్లు ఎంతోమంది ఉంటారు. తాజాగా పూణేకు చెందిన ఓ టెక్కీ భార్య ఏ మాత్రం చెప్పుకోదగిన కారణం లేకుండా 11 నెలల తన పసిపాను చంపేసి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భోపాల్లోని బైరాగఢ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి పూణెలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతనికి ఇండోర్కి చెందిన మహిళతో వివాహమైంది. ముందు సదరు మహిళకు గర్భం వచ్చి అబార్షన్ అయ్యింది. అప్పటి నుంచి ఆమె మానసికంగా కుంగిపోయింది. తర్వాత పాప పుట్టి 11 నెలలు అవుతున్నా ఆమెలో మార్పు రాలేదు.
ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో భోపాల్ వచ్చిన సదరు టెక్కీ కుటుంబం అక్కడే ఉంటోంది. ఈ క్రమంలోనే భర్త ఓ గదిలో వర్క్లో ఉండగా... భార్య తన 11 నెలల పసిపాపను ముందుగా ఊపిరాడకుండా చేసి చంపేసి ఆ తరువాత మూడో అంతస్తు నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకుంది. భర్త ముందుగా మేల్కొని తన పసిపాపను కాపాడుకునే ప్రయత్నంలో ఉండగా.. వెంటనే భార్య బిల్డింగ్ పైకి వెళ్లి దూకిచనిపోయింది. తొలిసారి గర్భం పోయినప్పటి నుంచి ఆమె డిప్రెషన్తో బాధపడుతోందని.. కూతురు పుట్టాక కూడా మార్పు రాలేదని చెప్పాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.