జూమ్ యాప్ సేఫ్ కాదు.. ఫేస్బుక్ కొత్త ఫీచర్ వచ్చేసింది!
ఈ మధ్య అందరినోట జూమ్ యాప్ ముచ్చటే ఎక్కువగా వినిపిస్తోంది. కానీ.. సెక్యూరిటీ పరంగా జూమ్ యాప్ అంత సేఫ్ కాదని.. ప్రమాదకరమని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. ఈ యాప్ను ఉపయోగించడం మానేయాలని కూడా కేంద్రం సూచించింది. వీడియో కాన్ఫరెన్స్కు అనుకూలంగా ఉన్న ఈ యాప్ను కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఉపయోగిస్తున్నారు. జూప్ యాప్ నిర్వహణ అంతా చైనా నుంచే నడుస్తుందన్న టాక్ బలంగా ఉండడంతో దానిపేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు జూమ్ యాప్కు ప్రత్యామ్నాయంగా అధునాతన ఫీచర్స్ను ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇందులో ముందుగా ఫేస్బుక్.. జూమ్ యాప్కు ప్రత్యామ్నాయంగా కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ‘మెసెంజర్ రూమ్స్’ పేరుతో తన మెసెంజర్ యాప్కు.. కొత్తగా వీడియో కాన్పరెన్స్ వెర్షన్ను జోడించింది. టైమ్ లిమిట్తో సంబంధం లేకుండా ఇందులో ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు.
తాము సమావేశం కావాలనుకున్న వారికి ఫేస్బుక్ అకౌంట్ లేకపోయినా కూడా.. వినియోగదారులు తమ ‘మెసెంజర్ రూమ్స్’లోకి వారిని ఆహ్వానించవచ్చు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్తో వీడియో కాలింగ్ కోసం అనేక యాప్లు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా జూమ్ లాంటి యాప్లలో వర్చువల్ మీటింగ్స్తో పాటు.. అనుకూలమైన ఫోటో బ్యాగ్రౌండ్లకు కూడా వీలుండటంతో లక్షలాది మంది వినియోగదారులు దీనినే ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే వీడియో కాన్ఫరెన్సింగ్ ఫీచర్ను డెవలప్ చేసిన ఫేస్బుక్.. త్వరలోనే మెసెంజర్ రూమ్స్కి వర్చువల్ బ్యాగ్రౌండ్లను జోడిస్తామని చెప్పడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..