అశోక్ సెల్వన్ తో జోడి కట్టనున్న...నిహారిక కొణిదెల.!!
'ఓ మై కడవులే' సినిమా తో పెద్ద సక్సెస్ను అందుకున్న యువ హీరో అశోక్ సెల్వన్. ప్రస్తుతం లాక్ డౌన్ లో కొత్తకథలను ఎంచుకొనే పనిలో పడ్డాడు. అయితే కొన్ని కథలను సెలెక్ట్ చేశాడు. అందులో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్ కథ నచ్చడంతో ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఆ సినిమాకి ఓ లేడీ డైరెక్టర్ దర్శకత్వం వహించనుంది.. ఆ డైరెక్టర్ పేరు స్వాతిని. ఈమె గతం లో ఎన్నో హిట్ సినిమాలను అందించిన సుశీంథిరన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది.
ఈ సినిమా కోసం నిహారిక కొణిదెల ను సెలెక్ట్ చేసినట్లు తమిళ సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈమె ఇప్పటికే విజయ్ సేతుపతి నటించిన 'ఓరు నల్ల నాల్ పాత్తు సోల్రేన్ ' లో నటించి మంచి పేరుతెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు లియోన్ జేమ్స్ మ్యూజిక్ ను అందిస్తున్నాడు.అయితే ఈ సినిమా లాక్ డౌన్ తరువాత సెట్స్ మేతకు తీసుకువెళ్లాలని నిర్మాణ వర్గాలు చెబుతున్నారు.
Yes and yes! I’m super excited and can’t wait for the shoot to start! ⭐️😁
My next! With @AshokSelvan
Directed by @iam_swathini
Produced by @Kenanya_Off
Music by @leon_james pic.twitter.com/v0BnYLGyl1 — niharika konidela (@IamNiharikaK) May 3, 2020