బ్రేకింగ్: కరోనా రావొద్దని భారీ ఎత్తున పూజలు

కరోనా రాకుండా ఉండాలి అంటే సామాజిక దూరం పాటించాలి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. జనాలు అందరూ ఒక్క చోటకు రాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. పూజలు చేస్తే కరోనా తగ్గదు. కాని ఈ విషయం తెలియని చాలా మంది మన దేశంలో ఇప్పుడు పూజలు చేయడం ఆందోళన కలిగిస్తుంది. వందలాది మంది ప్రజలు కనీసం లాక్ డౌన్ ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. 

 

కర్ణాటక లోని రామ నగర లో వందల మంది ప్రజలు ఒక చోట చేరి తమ కుల దైవానికి పూజలు చేస్తున్నారు. కరోనా రావొద్దని వారు లాక్ డౌన్ ని ఉల్లంఘించి పూజలు నిర్వహిస్తున్నారు. కనీసం సామాజిక దూరం కూడా పాటించడం లేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పోలీసులు కూడా అలా చూస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: