నవరత్నాల కోసం భూములు అమ్ముతామని ఎందుకు చెప్పలేదు...?

బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములను అమ్మడం అనేది తప్పుడు ఆలోచన అంటూ టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం భూములను విక్రయించడం పై ఆయన మండిపడ్డారు. ఎన్నికల హామీ కోసం ప్రభుత్వ భూములను అమ్మడం సరైనది కాదని ఆయన ఆరోపించారు. 

 

ప్రభుత్వ భూముల విక్రయం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన విమర్శించారు. సొంత వారికి భూములను కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది అంటూ నరేంద్ర దుయ్యబట్టారు. నవరత్నాల కోసం భూములను అమ్ముతామని ఎందుకు చెప్పలేదు అంటూ ఆయన ప్రశ్నించారు. బ్లీచింగ్ పౌడర్ లో కూడా ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుంది అంటూ ధూళిపాళ్ళ విమర్శించారు. కాగా నవరత్నాలు, నాడు నేడు కోసం భూములు అమ్ముతామని ఏపీ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: