కీలక నగరాలు అన్నీ కరోనా గుప్పిట్లోనే
దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తుంది. మన దేశంలో ఇప్పుడు కీలక నగరాలు అన్నీ కూడా కరోనా గుప్పిట్లోనే ఉండటం ఇప్పుడు ఆదాయం మీద ప్రభావం చూపిస్తుంది అనే చెప్పవచ్చు. మన దేశంలో కీలక నగరాలు ముంబై, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ నగరాలు ఈ నగరాల్లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.
ఈ నగరాలు గనుక త్వరగా కరోనా నుంచి బయటకు రాకపోతే మాత్రం పరిస్థితి ఆర్ధికంగా చాలా ఇబ్బందిగా మారే సూచనలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. కేంద్రం వెంటనే ఇక్కడ చర్యలకు దిగాల్సిన అవసరం ఉందని సూచనలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నగరాల మీద దృష్టి పెట్టి వైద్యులను అవసరం అనుకుంటే విదేశాల నుంచి తీసుకుని రావాలని సూచనలు చేస్తున్నారు.