బ్రేకింగ్: నాలుగు నియోజకవర్గాలకు టీడీపీ కొత్త ఇన్చార్జ్లు వీళ్లే..!
ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకే ఆపసోపాలు పడుతోన్న విపక్ష తెలుగు దేశం పార్టీ తెలంగాణలోనూ పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకుంటోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక తర్వాత అసలు ఆ పార్టీలో ఉండేందుకు సామాన్య కార్యకర్త సైతం ఇష్టపడడం లేదు. అలాంటిది తాజాగా గురువారం తెలంగాణలో నాలుగు నియోజకవర్గాలకు కొత్తగా పార్టీ ఇన్చార్జ్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్ . రమణ ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రెస్ నోట్లో పేర్కొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లోని ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి కృష్ణ ప్రసాద్, సికింద్రాబాద్ నుంచి పల్లారపు శ్రీనివాస్, అదే గ్రేటర్ లో ఉన్న పటాన్ చెర్వు నియోజకవర్గం నుంచి ఎడ్ల రమేష్ లకు నియోజకవర్గ కన్వీనర్లుగా బాధ్యతలు అప్పగించారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునా సాగర్ నియోజకవర్గం నుంచి మువ్వ అరుణ్ కుమార్ కు నియోజకవర్గ పగ్గాలు ఇచ్చారు.