ఇంట్లో 123 పాములు.. ఆ కుటుంబం ఏం చేసిందో తెలుసా..?
మధ్యప్రదేశ్ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. భింద్ జిల్లాలో పాములు కలకలం రేపుతున్నాయి. రోన్ గ్రామంలోని జీవన్ సింగ్ కుష్వాఅనే వ్యక్తి తన ఇంట్లో వారం రోజుల వ్యవధిలో 123 పాములను గుర్తించారు. తన ఇళ్లు పాములకు ఆవాసంగా మారడంతో చేసేదేమి లేక జీవన్ సింగ్ కుష్వా తన కుంటుంబంతో కలిసి వేరే ఊరికి వెళ్లిపోయాడు. రోజూ ఇంట్లోకి కోబ్రాలు వచ్చి చేరుతుండటంతో కొంతమంది గ్రామస్తులు శాపంగా భావిస్తున్నారు.
అయితే జీవన్ సింగ్ కుష్వా తన ఇంటిని కాపాడుకోవడానికి గార్డులా కాపాలాగా ఉంటున్నాడు. కొన్ని రోజులుగా పాములు కనిపిస్తుండటంతో జీవన్ సింగ్ ఇంటిని స్నేక్ హౌస్గా పేర్కొంటున్నారు. మరోవైపు పాములతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. పాములతో ఫారెస్ట్ ఆఫీసర్లు ఎవరికి ఎలాంటి హానిజరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.