శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక... టీటీడీ ఆన్లైన్ సేవల వెబ్సైట్ పేరు మార్పు...?
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆన్లైన్ సేవల వెబ్సైట్ను ప్రభుత్వ అనుబంధ వెబ్సైట్గా మార్చారు. టీటీడీ నుంచి ఈ మేరకు ప్రకటన జారీ అయింది. స్వతంత్రంగా ఉన్న టీటీడీ వెబ్ సైట్ ను ప్రభుత్వ సైట్కు అనుబంధంగా మారుస్తున్నట్లు టీటీడీ ప్రకటన చేసింది. ఈ వెబ్ సైట్ ద్వారా స్వామివారి ఆర్జితసేవలు, దర్శనం, బస, కల్యాణమండపాలు తదితర ఆన్లైన్ సేవలను బుక్ చేసుకోవడంతోపాటు ఈ-హుండీ, ఈ-డొనేషన్స్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
https:/ttdsevaonline.com వెబ్సైట్ను https:/tirupatibalaji.ap.gov.in గా మార్చినట్టు టీటీడీ ప్రకటించింది. కొత్త సైట్ అమలులోకి రానున్న కొన్ని గంటల ముందు టీటీడీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా గత నెలలుగా శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. అన్ని ఆలయాలను మూసివేయాలని కేంద్రం మరోసారి స్పష్టం చేయడంతో రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనల్లో మార్పుల తరువాత శ్రీవారి ఆలయం తెరుచుకోనుంది.