అందుకే వలస కార్మికులను తరలిస్తున్నారా...?
దేశంలో లాక్ డౌన్ ని పెంచే అవకాశాలు కనపడుతున్నాయి. వలస కార్మికుల కోసం ఇప్పుడు కేంద్రం ప్రత్యేక రైళ్ళను నడుపుతుంది. ఇప్పుడు వాటి సంఖ్యను మరింతగా పెంచే అవకాశాలు కనపడుతున్నాయి. మరిన్ని రైళ్ళను నడపడానికి గానూ రైల్వే శాఖ కసరత్తులు చేస్తుంది. ఇప్పుడు ఇంకా వారిని వేగంగా తరలించి లాక్ డౌన్ ని పెంచే ఆలోచనలో కేంద్రం ఉందని సమాచారం.
మరో రెండు వారాలు లేదా మూడు వారాలు లాక్ డౌన్ ని పెంచే సూచనలు కనపడుతున్నాయని అంటున్నారు. వేల మంది వలస కార్మికులు దక్షిణ భారత దేశం సహా మహారాష్ట్రలో భారీగా వలస కార్మికులు ఉన్నారు. వారు అందరిని కూడా వేగంగా తరలించే కార్యక్రమాలు చేస్తుంది. కాగా లాక్ డౌన్ పై రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది.