రామ్చరణ్ సతీమణి ఉపాసన ఇంట విషాదం..!
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. అయితే సెలబ్రటీల ఇంట్లో కూడా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మద్య బాలీవుడ్ నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ లు కన్నముశారు. ఆ తర్వాత నిర్మాత, దర్శకులు కన్నుమూశారు. తాజాగా మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇంట విషాదం చోటు చేసుకుంది. ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతిరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వయస్సు పైబడడం వలన ఆయన తుదిశ్వాస విడిచినట్ట తెలుస్తుంది. వయస్సు పైబడడం వలన ఆయన తుదిశ్వాస విడిచినట్ట తెలుస్తుంది.
కాగా, తెలంగాణలోని దోమకొండలో జన్మించిన ఉమాపతి రావు ఐఏఎస్ ఆఫీసర్గా పని చేశారు. పేద ప్రజల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారట. తన తాతయ్య మృతితో ఉపాసన భావోద్వేగానికి గురైంది... నిస్వార్థం, మానవత్వం, హాస్య చతురత ఉన్న ఆయన ఉర్దూలో రాసిన రచనల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు...టీటీడీ తొలి ఈవోగా పనిచేశారు. గొప్ప సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. మీరందరు కన్నీటి ద్వారా కాకుండా చిరునవ్వుతో ప్రేమని కురిపించాలంటూ స్పష్టం చేసింది. ఉపాసన సన్నిహితులు, మెగా అభిమానులు ఉమాపతి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నారు.
auto 12px; width: 50px;">View this post on InstagramK. Umapathy Rao of The Erstwhile Samasthan of Domakonda - IAS 15th {{RelevantDataTitle}}