తిరుపతిలో దారుణం.. పాత భవనం కూల్చివేతలో అపశృతి !

Edari Rama Krishna

అప్పటి వరకు తన అక్కతో సంతోషంగా ఉన్నాడు.. పాల ప్యాకెట్ కోసం వెళ్లి అనంత లోకాలకు వెళ్లాడు.  తిరుపతిలోని కోటకొమ్మల వీధిలో పాత భవనం కూల్చివేతలో అపశృతి చోటు చేసుకుంది. భవనం కూల్చివేసే సమయంలో చేసిన చిన్న నిర్లక్ష్యం ఓ బాలుడి ప్రాణాలు బలి అయ్యాయి. తిరుపతిలోని కోటకొమ్మల వీధి వద్ద పాల ప్యాకేట్ తీసుకోవడానికి వచ్చిన భరత్ అనే బాలుడిపై శిథిలాలు పడ్డాయి. బాలుడు తీవ్రంగా గాయ పడటంతో  వెంటనే రుయా ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.

 

చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. అయితే భవన నిర్మాణం కూల్చి వేసే సమయంలో అక్కడి కార్మికులు కనీసం చుట్టు పక్కల ఎవరు ఉన్నారా? లేరా అని గమనించకుండా ఇష్టానుసారంగా కూల్చి వేయడంతో అక్కడే ఉన్న భరత్ పై శిథిలాలు పడిపోయాయి.  తగిన జాగ్రత్తలు తీసుకోకుండా భవనాన్ని కూల్చిన సిబ్బందిపై స్థానికులు మండిపడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: