జీ 7 సదస్సు: ట్రంప్ ఆహ్వానానికి ఏంజెలా మెర్కెల్ నో.... కీలక నిర్ణయం తీసుకున్న ట్రంప్..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7) సమ్మిట్కు హాజరు కావాలంటూ చేసిన ఆహ్వానాన్ని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నిరాకరించారు. అక్కడి అధికార వర్గాలు నిన్న ఈ విషయాన్ని వెల్లడించాయి. ట్రంప్ ఆహ్వానానికి కృతజ్ఞతలు చెప్పిన మెర్కెల్ కరోనా కష్ట కాలంలో తాను రాలేనని తెలిపారు. ఈ సంవత్సరం మార్చిలో జరగాల్సిన జీ 7 శిఖరాగ్ర సమావేశం కరోనా ఎఫెక్టుతో జూన్ కు వాయిదా పడింది. తాజాగా ఈ సమావేశం మరోసారి వాయిదా పడనుందని తెలుస్తోంది.
జీ 7 సదస్సును నేరుగా నిర్వహిస్తామని ట్రంప్ ఇదివరకే ప్రకటన చేశారు. సభ్యులందరి ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడంతో కరోనా వైరస్ సాధారణ స్థాయికి వచ్చిందనే గొప్ప సంకేతం ప్రపంచానికి ఇవ్వవచ్చని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఏంజెలా మెర్కెల్ హాజరు కానని చెప్పడంతో ట్రంప్ ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు రష్యా తిరిగి ఈ బృందంలో చేరాలని కోరుకుంటోందని తెలిపారు.
Breaking News: President trump postponed a G7 meeting after Chancellor angela Merkel of germany declined to attend, adding that he wants russia to rejoin the group.https://t.co/EsUFfeJhPU — The New York Times (@nytimes) May 31, 2020