ఎమ్మెల్యే కి క్లాస్ పీకిన ఉత్తమ్

రేవంత్ రెడ్డిని కాంగ్రెస్  రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చెయ్యడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తా అని ఆయనకే నేరుగా తన సమస్యలను చెప్తా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణా పీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంకోసారి పీసీసీ మార్పుల గురించి మాట్లాడవద్దు అని ఆయన స్పష్టం చేసారు. 

 

అనవసరంగా ఏ వ్యాఖ్యలు కూడా చేయవద్దు అని ఇప్పుడు అసలు మాట్లాడాల్సిన అవసరం ఎం వచ్చింది అని ఆయన నిలదీశారు. తాను ఇంకెప్పుడు దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేయను అని ఏ పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చిందో ఆయన వివరించారు. ఇంకోసారి ఇలాంటివి చేస్తే అనవసరంగా పార్టీకి ఇబ్బంది అని ఆయనకు ఉత్తమ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: