కొండచరియలు విరిగిపడి 21 మంది మృతి
అసోంలోని బరాక్ లోయ పరిధిలోని హాయీలాకాందీ, సిల్చర్, కరీంగంజ్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డా యి. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మందికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను ఆసుపత్రులకు తరలించిన సహాయక బృందాలు, పో లీసులు చికిత్స అందిస్తున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు వివరించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. బాధిత కుటుంబాలన్నీ దుఃఖసాగరంలో మునిగిపోయాయి. అయితే.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి.