భూమిని కాపాడాలంటున్న ప్రభాస్..
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అనేక పోస్ట్లు చేశారు. పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెబుతూ మొక్కలు నాటారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునందించాలని కోరారు. ఈక్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కూడా మొక్కను నాటుతున్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
భూమిని కాపాడుదాం.. మొక్కను నాటుదాం.. భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందిద్దాం.. అంటూ ప్రభాస్ ట్వీట్ చేశారు. ప్రభాస్ మొక్కను నాటుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Save the earth, plant a tree Earth 🌍
Let's take a step forward in making this planet a better one for our future generations 🌿🌴#Prabhas 💚#WorldEnvironmentDay2020 #WorldEnvironmentDay pic.twitter.com/FKRolDK6kM — prabhas (@PrabhasRaju) June 5, 2020