బ్రేకింగ్: షేక్ పేట ఎమ్మార్వో కి బిగుస్తున్న ఉచ్చు

షేక్ పేట ఎమ్మార్వోకి ఏసీబీ అధికారులు ఉచ్చు బిగుస్తున్నారు. ఆమె ఇంట్లో దొరికిన 30 లక్షలతో పాటుగా ప్రభుత్వ పత్రాల మీద దాదాపు ఆరు గంటల పాటు ఆమెను విచారిస్తున్నారు అధికారులు. ఇక 30 లక్షల గురించి ఆమెను అడగగా అది అంతా తన సంపాదన అంటూ సుజాత ఏసీబీ అధికారులకు చెప్తున్నారు. ఇక ప్రభుత్వ పత్రాల గురించి ఏమీ స్పందించడం లేదు అని సమాచారం. 

 

ఆమె ఆర్ఐ వీఆర్వోలతో కలిసి అవినీతి చేస్తున్నట్టు గుర్తించారు అధికారులు. దీనితో షేక్ పేట కు చెందిన వీఆర్వో ఖాలీద్ ని అధికారులు విచారణకు పిలిచారు. వీఆర్వోతో ఆమె ఎక్కువగా డీలింగ్స్  చేసినట్టు గుర్తించారు. ఆర్ఐ నాగార్జున రెడ్డిని కూడా నేడు మరోసారి విచారించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: