ఢిల్లీ సరిహద్దులు మళ్ళీ సీల్...?

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ ప్రయత్నాలు చేస్తున్నా వేల కేసులు నమోదు అవుతున్నాయి ఢిల్లీలో. ఇక ఇదిలా ఉంటే ఢిల్లీ ఇప్పుడు అంతర్రాష్ట్ర సరిహద్దును మూసి వేసే ఆలోచనలో ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ముంబై తరువాత ఢిల్లీలోనే దేశంలో అత్యధిక కేసులు ఉన్నాయి.

 

ఢిల్లీ ప్రక్కన ఉన్న ఉన్న ఫరీదాబాద్, సోనిపట్, గుర్గావ్ సహా పలు జిల్లాల నుంచి జనాలు ఎక్కువగా వస్తున్నారు. దీనితో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు ఢిల్లీ సరిహద్దులను మూసి వేసే ఆలోచనలో ఉన్నారు. సోమవారం రాష్ట్ర సరిహద్దులను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మూసి వేసే ఆలోచనలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: