విజయవాడ గ్యాంగ్ వార్ లో మరికొందరి హస్తం

విజయవాడ గ్యాంగ్ వార్ కి సంబంధించి ఇప్పుడు పోలీసులు దూకుడు పెంచారు. ఈ గ్యాంగ్ వార్ లో మరి కొందరు ఉన్నారు అని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే మరి కొందరిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతుంది.  విజయవాడ గ్యాంగ్ వార్ లో మరో 14 మంది హస్తం ఉంది అని వారి కోసం గాలింపు చర్యలు చేపడతున్నామని అధికారులు పేర్కొన్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ గ్యాంగ్ వార్ కి సంబంధించి తోట సందీప్ అనుచరులను మొత్తాన్ని అరెస్ట్ చేసారు. అలాగే పండు గ్యాంగ్ కి సంబంధించి కూడా కొందరిని అరెస్ట్ చేసారు. నేడు పండు ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక పండు తల్లి కూడా పోలీస్ కష్టడీ లోనే ఉన్నారు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: