మరిన్ని ఆత్మహత్యలు చూస్తారు : సింగర్ సోను నిగమ్
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం సంచలనంగా మారుతున్న విషయం తెల్సిందే. సుశాంత్ సింగ్ మరణానికి గుత్తాధిపత్యమె కారణం అంటూ కొంతమంది బాహాటంగానే విమర్శలు చేశారు.
అయితే తాజాగా సింగర్ సోను నిగం కూడా గుత్తాధిపత్యం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో సంగీత ప్రపంచంలో కూడా ఆత్మహత్యలను చూస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సోను నిగమ్ . సినీ రంగం కంటే పెద్ద మాఫియా సంగీత రంగంలో ఉంది అంటూ సోను నిగమ్ వ్యాఖ్యానించారు. ఈ రంగంలోనూ గుత్తాధిపత్యం రాజ్యమేలుతుందని రెండు కంపెనీలు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నాయి అంటూ తెలిపారు. కాగా సోను నిగమ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.