ఫ్యానుకు ఉరేసుకుని సామాజిక కార్యకర్త బలవన్మరణం!

Narayana Molleti
సామాజిక కార్యకర్త లగడపాటి హేమలత ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఖమ్మంలో ప్రముఖ సామాజిక కార్యకర్త లగడపాటి హేమలత ఆత్మహత్య చేసుకున్నారు. కవిరాజ్​నగర్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

వైబ్రేంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ మహిళా అధ్యక్షురాలిగా లాక్​డౌన్‌ సమయంలో నగరంలోని ఎంతో మంది పేదలకు నిత్యవసరాలు పంపిణీ చేశారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఈమె మృతి పట్ల అనేక అనుమానాలు రేకెత్తిస్తుంది. ఎవరి బెదిరింపు లు వలన ఈ ఆత్మహత్య చోటు చేసుకుందా అనే విధంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: