వైసీపీ నేత పివిపి పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు..?
వైసీపీ నేత పివిపి పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పివిపి పై కైలాష్ విక్రమ్ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై పివిపి గుండాలతో దౌర్జన్యానికి దిగారు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు కైలాష్.
40 మంది అనుచరులతో తన ఇంటిపై దారుణంగా దాడి చేశారని ఆరోపించాడు. టెర్రస్ పై గార్డెన్ కట్టొద్దు అంటూ తనను బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నాడు, అయితే గత ఏడాది క్రితం పివిపి విల్లాస్ లో ఇల్లు కొనుగోలు చేశారు కైలాస . కొనుగోలు సమయంలో ఎలాంటి రూల్స్ చెప్పలేదని కానీ ప్రస్తుతం బెదిరింపులకు పాల్పడుతూ భయాందోళనకు గురి చేస్తున్నారు బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించాడు.