ఆత్మహత్యల దిశగా యువ భారతం..!
దేశంలో ఆత్మహత్యలు పెరిగే అవకాశాలు ఉన్న్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. దేశ వ్యాప్తంగా కూడా కరోనా మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు అని ఇప్పుడు కరోనా తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని, కాబట్టి వ్యాపారాలు అన్నీ కూడా నెలల తరబడి మూతపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక సంస్థలు కూడా ఇప్పుడు ఉద్యోగులను భరించలేని స్థితికి వచ్చాయి అని అంటున్నారు. యువతలో ఉద్యోగాలు పోయి ఆత్మహత్యలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
యువత ఇప్పుడు కరోనాతో బాగా ఇబ్బంది పడుతున్నారు, వారి ఆర్ధిక పరిస్థితి మీద బాగా దెబ్బ కొట్టింది కరోనా అంటూ పలువురు లెక్కలు చెప్తున్నారు. ఇక సాఫ్ట్వేర్ రంగంపై కరోనా ఎక్కువ ప్రభావం చూపడంతో ఈ రంగంలో ఇప్పటికే విలాస జీవితానికి అలవాటు పడిన యువత తీవ్ర మానసిక సంక్షోభంలో ఉందట. అందుకే యువ భారతం ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకునే సూచనలు ఎక్కువుగా ఉన్నాయని అంటున్నారు.