చైనా వస్తువులకు నిప్పంటించిన దర్శకుడు..?
గాల్వన్ ఘర్షణలో ఏకంగా భారతదేశానికి చెందిన ఒక కల్నల్ 20 మంది జవాన్ లు చనిపోవడంతో బ్యాన్ చైనా అనే నినాదాన్ని తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎంతోమంది చైనా వస్తువులను పార వేస్తున్నారు. తాజాగా తమిళ దర్శకుడు శక్తి చిదంబరం తన ఇంట్లోనే చైనా వస్తువులకు నిప్పంటించాడు .
తన ఇంట్లోని టేప్ రికార్డర్లు సెల్ఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటిని కుప్పగా పోసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు దర్శకుడు శక్తి చిదంబరం. చైనా పై ఆర్థిక నిషేధం విధించాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.